
మాదాపూర్, వెలుగు: రెంట్ విషయంలో ఓనర్తో గొడవ పడిన ఓ టిఫిన్ సెంటర్యజమాని మనస్తాపానికి గురై, కిరోసిన్పోసుకొని నిప్పంటించుకున్నాడు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాదాపూర్పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్అయ్యప్ప సొసైటీ100 ఫీట్ రోడ్డులో సుధారాణికి చెందిన బిల్డింగ్లోని షట్టర్ను అయ్యప్ప సొసైటీ సైబర్రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆదినారాయణ(52) 2021 అద్దెకు తీసుకున్నాడు.
అందులో లక్ష్మీ తులసి పేరిట టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నరగా అద్దె చెల్లించడం లేదు. 6 నెలలుగా రెంట్ఇవ్వండి లేదా టిఫిన్ సెంటర్ ఖాళీ చేయండంటూ యజమాని ఒత్తిడి తెస్తోంది. అయినా అద్దె చెల్లించకపోవడం, షాప్ ఖాళీ చేయకపోవడంతో ఈ నెల 16న ఆదినారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
18న తాము షాప్ఖాళీ చేయబోమని ఆదినారాయణ కుమారుడు భాను సివిల్ కోర్టులో కేసు వేసి, ఆర్డర్ తెచ్చుకున్నాడు. దీంతో బిల్డింగ్యజమాని అనుచరులు ఈ నెల 27న సాయంత్రం 5.30 గంటలకు టిఫిన్సెంటర్వద్దకు చేరుకొని, కుర్చీలను ధ్వంసం చేశారు. క్యాష్ కౌంటర్లోని డబ్బులు తీసుకొని, అడ్డువచ్చిన ఆదినారాయణ కుమారుడు, పనివారిపై చేయి చేసుకున్నారు.
దీంతో మనస్తాపానికి గురైన ఆయన అక్కడే ఉన్న కిరోసిన్ను ఒంటిమీద పోసుకొని, నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పివేసి, బాధితుడిని మాదాపూర్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు.
సుధారాణి అనుచరులు వచ్చి, తమ టిఫిన్ సెంటర్లోని వస్తువులను ధ్వంసం చేసి, తమ వారిని కొట్టారని మృతుడి భార్య తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బిల్డింగ్ యజమాని సుధారాణి, గంగారం యాదవ్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.