సమాజసేవలో ‘టిక్‌‌‌‌టాక్‌‌‌‌ ఫ్రెండ్స్​’

సమాజసేవలో ‘టిక్‌‌‌‌టాక్‌‌‌‌ ఫ్రెండ్స్​’

క్యాన్సర్‌‌‌‌ బాధితుల కోసం ఫండ్‌‌‌‌ రైజింగ్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు :  సరదా కోసం వీడియోలు చేయడమే కాదు.. సమాజం కోసం తమ వంతు కృషి చేస్తామంటున్నారు టిక్ టాక్ ఫ్రెండ్స్​. ఎక్కడెక్కడో ఉండే వీరు తమ వీడియోల ద్వారా వివరాలను షేర్‌‌‌‌ చేసుకొని ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇందుకు ఆకాశ్, ఇమ్రాన్ ల ఆలోచనతో దాదాపు 200 మంది టిక్‌‌‌‌టాక్‌‌‌‌ గ్రూప్‌‌‌‌గా ఉండి సోమవారం సిటీలోని కంట్రీ క్లబ్‌‌‌‌లో ఒకచోట కలిశారు. కొన్ని నెలలుగా కష్టపడి దాదాపు  1000 మందికి పైగా టిక్ టాక్ సభ్యులతో వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి మంచి పనికి ప్లాన్ చేశారు.

క్యాన్సర్‌‌‌‌ బాధితులను ఆదుకునేందుకు ప్రోగ్రాం కండక్ట్ చేసి ఫండ్‌‌‌‌ రైజ్‌‌‌‌ చేశారు. వీరికి మద్దతుగా అనేక మంది  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో విరాళాలను అందించేందుకు సుముఖత తెలిపారు. కార్యక్రమంలో టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు, పటాస్ ప్రోగ్రాం హాస్య నటుడు యాదం రాజులు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రోగ్రామ్స్‌‌‌‌కు  ప్రతి ఒక్కరూ తమ మద్దతు ఇవ్వాలని కోరారు.