
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్లేయర్ అవార్డు ను సొంతం చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో భాగంగా సింధును ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. గురువారం ఢిల్లీలో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో సింధుకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. సింధుకు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకునే క్రమంలో సింధుకు రోహిత్ శర్మ (క్రికెట్), భజ్ రంగ్ పునియా (రెజ్లర్), వినేశ్ ఫోగాట్ (రెజ్లర్), అమిత్ పంఘాల్ (బాక్సర్), సౌరభ్ చౌదరి (షూటర్), మను భాకర్ (షూటర్) నుంచి గట్టిపోటీ ఎదురైంది.