తిరుమల బ్రహ్మోత్సవాలు: మూడోరోజు ( సెప్టెంబర్ 26)న సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

తిరుమల బ్రహ్మోత్సవాలు:  మూడోరోజు ( సెప్టెంబర్ 26)న సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ( సెప్టెంబర్​ 26) శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో భక్తులకు  దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో తిరుమల   శ్రీవారు మూడో రోజు ( సెప్టెంబర్​ 26) ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతమని పండితుల చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. 

సింహ రూప దర్శనంతో  శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో   ముర‌ళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.