ఎల్లుండి చలో బస్ భవన్

ఎల్లుండి చలో బస్ భవన్
  • తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పిలుపు

బషీర్ బాగ్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల15న ‘చలో బస్ భవన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. హైదర్ గూడ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నాయకులు కార్యక్రమం పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు టి.సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. 2013 పీఆర్సీలోని 50% బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే 2017, 2021 పీఆర్సీలను అమలు చేయాలని, కార్పొరేషన్ యూనియన్లను గుర్తించి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్ బీఎస్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీ బకాయిలు చెల్లించాలని, బస్సు డ్రైవర్లు, కండెక్టర్లకు కార్పొరేషన్ ద్వారా పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​చేశారు.