కేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం

కేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం

విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీపై ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 31న కాన్సిట్యూషన్ క్లబ్లో కేసీఆర్ పాలనపై సెమినార్ కార్యక్రమం ఉంటుందన్నారు. యోగేంద్రా యాదవ్ వంటి వక్తలు కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారన్నారు. పబ్లిక్ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇంకా జరగలేదు. విభజన చట్టంలోన10వ షెడ్యూల్ లో కీలక అంశాలు ఉన్నాయని.. 9 ఏళ్లుగా వాటిపై దృష్టి పెట్టలేదని కోదండరాం విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడంతో కేంద్రం పట్టించుకోలేదన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఏ అంశం అమలుకాలేదన్నారు. కృష్ణా నదీ జలాల్లో 170 టీఎంసీల నీరు మాత్రమే తెలంగాణ కు దక్కిందని.. ప్రస్తుతం ఉన్న నీటివాటాతో పెండింగు ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం అసాధ్యమన్నారు.