ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు

ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు

కేసీఆర్ సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రత్యామ్నాయ ఎజెండాపై కేసీఆర్ కు మాట్లాడే అధికారం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశామన్నారు. కృష్ణా, గోదావరి జలాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. మే నెలలో ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై యాత్రలు, నిరసనలు చేస్తామన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లి పార్టీఆఫీస్ లో జెండా ఎగురవేశారు కోదండరాం.

మరిన్ని వార్తల కోసం

మండుటెండలో వినూత్నంగా పెళ్లి బరాత్

పెళ్లిలో నాగిన్ డాన్స్ కోసం నిజమైన కోబ్రా