ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

త్రిపురలో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు నిరసనగా ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. హోంశాఖ ఆఫీస్ ముందు బైఠాయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. TMC ఎంపీలు హోంశాఖ ఆఫీస్ లోకి దూసుకెళ్లకుండా... వారిని చుట్టుముట్టారు CISF జవాన్లు, ఢిల్లీ పోలీసులు. దీంతో హోంశాఖ ఆఫీస్ ముందే కూర్చుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.