కేంద్ర హోంమత్రి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటించారు. సోమవారం ఆయన బెగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి వెళ్లిపోతున్న అమిత్ షా ప్రయాణించే హెలీకాప్టర్ కంట్రోల్ తప్పింది. హెలీకాప్టర్ టేక్ ఆఫ్ టైంలో నేరుగా గాల్లోకి ఎగరకుండా కాసేపు కిందనే చక్కర్లు కొట్టింది. మంత్రి అమిత్ షా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సమయంలోనే హెలీకాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది.
కొన్ని సెకండ్ల తర్వాత హెలీకాప్టర్ సురక్షితంగా టేకాఫ్ అయ్యింది. వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏర్పాటుచేసిన హెలీకాప్టర్కు సంబంధించిన వివరాలను సైతం అధికారులు ఆరా తీస్తున్నారు. హెలీకాప్టర్ అలా కంట్రోల్ తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియదు.