హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 70,958కి చేరిందని..50,814 మంది వైరస్ నుంచి కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం 19,568 మంది కరోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా..గడిచిన 24 గంటల్లో 13 మంది మరణించారని , ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 576 కి చేరిందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 21, 118 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య5,22,143కి చేరిందని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ.