ఢిల్లీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు కరోనా పాజిటివ్‌

ఢిల్లీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు కరోనా పాజిటివ్‌

ఢిల్లీలో ముగ్గురు డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ‌ అధికారులు. ఆర్మీ డాక్టర్ తో సహా మరో ఇద్దరు డాక్ట‌ర్లు కరోనా వైరస్‌ భారిన పడ్డారని చెప్పారు. ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా హాస్పిట‌ల్ కి చెందిన ఇద్దరు డాక్ట‌ర్ల‌కు కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. దీంతో ఇద్ద‌రు హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని.. వీరి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో, డాక్ట‌ర్ల‌తో కాంటాక్ట్‌ అయిన వారందరి ఆచూకీ కనుగొనే పనిలో నిమగ్నమయ్యామ‌ని తెలిపారు.

యాంటీ కోవిడ్‌-19 ఆపరేషన్ లో పాల్గొన్న ఆర్మీ డాక్టర్‌ ఒకరు కరోనా వైరస్‌ భారిన పడ్డారని.. అత‌డు ఢిల్లీ స‌ర్కిల్ లో విధులు నిర్వర్తిస్తున్నాడని చెప్పారు. ఇప్ప‌టికే ఆర్మీ డాక్ట‌ర్ తో కాంటాక్ట్‌ అయినవారిలో కొంత‌మందిని గుర్తించి, పాజిటివ్ గా తేలిన వ్యక్తులను ఐసోలేషన్ కు తరలించామ‌న్నారు ఆరోగ్య‌శాఖ అధికారులు.