
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా .. వైరస్ తో 32 మంది చనిపోయారని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. కరోనా బారినపడిన 7,430 మంది కోలుకున్నారని చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 5,06,988కి పెరిగాయని..వీరిలో 4,44,049 మంది కోలుకున్నారని తెలిపింది. ఇవాళ్టి వరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 75,289 శాంపిళ్లను పరీక్షించారు. తెలంగాణలో కొవిడ్ మరణాలు రేటు 0.55 శాతంగా ఉంది. రికవరీ శాతం 87.58గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తన రిపోర్ట్ లో తెలిపింది.