
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతూనే ఉన్నాయి. కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన బులిటెన్ లో వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు 1650కి చేరుకున్నాయని ప్రకటించింది. యాక్టివ్ కేసులు 1093 ఉన్నాయని, ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటివరకు 33 మంది కరోనాతో మృతిచెందినట్లు తెలిపిన ఆరోగ్యశాఖ.. కరోనా జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.