
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రోజుకు 80కి మించకుండా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,259 కి చేరిందని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు.. కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 17, కర్నూలు జిల్లాలో 40, కడప జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం 978 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా..258 మంది డిశ్చార్జ్ అయ్యారని, 31 మంది చనిపోయినట్లు చెప్పింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.