ఇవాళ (జనవరి 24) జేబీఎస్లో వస్తువుల వేలం.. కార్గోలో మిగిలిపోయిన వస్తువుల అమ్మకం

ఇవాళ (జనవరి 24) జేబీఎస్లో వస్తువుల వేలం.. కార్గోలో మిగిలిపోయిన వస్తువుల అమ్మకం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువుల(అన్​ క్లెయిమ్​ ఐటమ్స్)ను శనివారం (జనవరి 24)  జేబీఎస్​లో వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన వేలానికి ఆదరణ లభించిందని, చాలా రకాల వస్తువులు తక్కువ ధరలకే చాలా మంది సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. 

మరోసారి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేబీఎస్​లాజిస్టిక్​ విభాగంలో వేలం ఉంటుందని గ్రేటర్​ ఆర్టీసీ అసిస్టెంట్​ ట్రాఫిక్​ మేనేజర్​(లాజిస్టిక్స్​) ఇషాక్ ​బిన్​మహ్మద్​ తెలిపారు. ప్రతినెలా నిర్వహించే  వేలంలో వస్తువులను 30 నుంచి 50 శాతం తక్కువ ధరలకే ఇస్తున్నామన్నారు. ఈ సారి 31 రకాల ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు తెలిపారు.