స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిఫ్టీ 11 వేల 600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్ ఫ్లాట్ గానే ప్రారంభమైనప్పటికీ.. వెంటనే నష్టాల్లోకి జారుకొని తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి 495 పాయింట్ల నష్టంతో 38 వేల645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి.. చివరకు 158 పాయింట్ల నష్టంతో 11 వేల594 దగ్గర ముగిసింది.
