భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిఫ్టీ 11 వేల 600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్‌ 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్‌ ఫ్లాట్‌ గానే ప్రారంభమైనప్పటికీ..  వెంటనే నష్టాల్లోకి జారుకొని తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.  చివరికి 495 పాయింట్ల నష్టంతో 38 వేల645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి.. చివరకు 158 పాయింట్ల నష్టంతో 11 వేల594 దగ్గర ముగిసింది.