నేడే v6-వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్

నేడే v6-వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది యువ క్రికెటర్లు ప్రతిభ చాటుకునేందుకు చేయూత నిచ్చిన వెలుగు, వీ6 క్రికెట్‌ టోర్నమెంట్ ఫైనల్‌ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం మెగా టోర్నీ ఫైనల్ పోరు జరగనుంది. నెల రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు దూసుకొచ్చిన నిజామాబాద్ అర్బన్, మహబూబ్ న‌గర్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 28నే ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉన్నా.. పుల్వామా ఉగ్ర దాడి తర్వా త దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేశారు. ఇప్పడు పరిస్థితులు చక్కబడటంతో తుదిపోరుకు అన్నిఏర్పా ట్లు చేసింది. టోర్నీ విజేతకు రూ. లక్ష, రన్నరప్‌ కు రూ. 50 వేలు ప్రైజ్ మనీగా అందజేస్తారు. ఫైనల్‌, ముగింపు వేడుకలకు టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, రాష్ట్ర క్రీడా మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ వెంకట స్వామి అతిథులుగా హాజరుకానున్నారు.