
- ఎన్నికల వ్యూహం, రథయాత్రపై చర్చ
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్ల మీటింగ్ శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో పాటు స్టేట్ ఆఫీస్ బేరర్లు, అన్ని జిల్లాల బీజేపీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పార్టీ కార్యక్రమాల అమలుపై మీటింగ్లో చర్చించనున్నారు. 10 నుంచి ప్రారంభించనున్న రథయాత్రపైనా సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను కట్టడి చేసి, బీజేపీ గెలుపునకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపైనా చర్చించనున్నారు.