వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం కోసం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది.
ఈ అంశాలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం ఈనెల 21న రాష్ట్ర సీఎస్ ను సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. 30న రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.