వ్యవసాయ సమస్యలపై రేపు మండల కేంద్రాల్లో కాంగ్రెస్​ ధర్నాలు

వ్యవసాయ సమస్యలపై రేపు మండల కేంద్రాల్లో కాంగ్రెస్​ ధర్నాలు

వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై  రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్రెస్​ నాయకులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం కోసం అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులతో ఇంచార్జ్ లను టీపీసీసీ నియమించింది.

ఈ అంశాలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకుల బృందం ఈనెల 21న రాష్ట్ర సీఎస్​ ను సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. 30న రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు కాంగ్రెస్​ పిలుపునిచ్చింది.