సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం: డీజీపీ

సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం: డీజీపీ
  • సైబర్ వాలంటీర్లు, కమాండోలను నియమించాలి
  • కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ సుందరి నందా
  • 5 రాష్ట్రాల ఆఫీసర్లతో కోఆర్డినేషన్​ మీటింగ్​
  • సైబర్ నేరాలను నివారించాలి
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంపై దాఖలైన పిల్​ను ఈ నెల 19న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్స్​లోని బాత్​రూమ్స్, టాయిలెట్స్, దిండ్లు, పరుపులు వంటివి విద్యార్థులకు సరిపడా ఉన్నాయో.. లేవో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్నిమాపక యంత్రాలు, వార్డెన్​ల సంఖ్య వంటి వివరాలపై కూడా రిపోర్టు ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ హాస్టల్స్​లో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్‌‌–2018 నిర్దేశించిన గైడ్‌‌లైన్స్‌‌కు అనుగుణంగా వసతుల్లేవంటూ దాఖలైన పిల్‌ను శుక్రవారం బెంచ్‌‌ విచారించింది.

ALSO READ: పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్ .. టెట్​కు భారీగాహాజరైన అభ్యర్థులు

గైడ్​లైన్స్ మేరకు సదుపాయాల్లేవు

గైడ్​లైన్స్ మేరకు సౌలత్​లు కల్పించడం లేదని, పది మందికి ఒక బాత్‌‌రూమ్, ఏడుగురికి ఒక టాయిలెట్, 50 మందికో వార్డెన్‌‌ ఉండాలని గైడ్‌‌లైన్స్‌‌ నిర్దేశిస్తున్నా.. ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ వాదించారు. పలు రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు, హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. స్టూడెంట్స్​కు ఇస్తున్న భోజనం కూడా సరిగ్గా లేదని, దీంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలోని దేవరుప్పుల, మోర్తాడ్, మన్ననూర్‌‌లోని స్కూల్స్​లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఫుడ్‌‌ పాయిజన్‌‌ కారణంగా దాదాపు 300 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారన్నారు. దాదాపు 15 మంది అమ్మాయిలు ఐసీయూలో ఉన్నారని వివరించారు.