
కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా ఉందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ నిర్ణయాలతోనే కాళేశ్వరం కూలిందన్నారు.. కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారని గుర్తుచేశారు. ప్రజలు దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఫ్యామిలీ డ్రామాలాడుతోందన్నారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కుటుంబ దోపిడి బయటపడుతుందన్నారు.
పదేళ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు మహేశ్ కుమార్ . అధికారంలో ఉన్నపుడు హరీశ్ అవినీతిపై కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.ఏనాడైనా కేసీఆర్ కు హరీశ్ మీద ఎందుకు కవిత కంప్లైంట్ చేయలేదన్నారు. వాటాలల్లో తేడాలొచ్చినపుడే కవిత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు కేటీఆర్ పై విమర్శలు చేసిన కవిత ఇపుడు హరీశ్, సంతోష్ లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
బీసీ కోటా బిల్లును బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటుందన్నాని ఫైర్ అయ్యారు మహేశ్ కుమార్.. అసెంబ్లీలో మాట ఇచ్చిన తర్వాత బీజేపీ మాట మార్చిందన్నారు. బీసీ కోటా అమలు కాకుండా బీజేపీ అడ్డుపడుతుందని ఫైర్ అయ్యారు.