కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె పార్టీల కుట్రలు తిప్పికొట్టాలె : రేవంత్

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె పార్టీల కుట్రలు తిప్పికొట్టాలె : రేవంత్

హనుమకొండ జిల్లా : చారిత్రక కాజీపేట దర్గాను దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాజీపేట దర్గా మత సామరస్యానికి పునాది వంటిదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ దర్గాను దర్శించి ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చదర్ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల్లో 25 శాతం నిధులను మైనారిటీల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.