హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్లపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజలను దోచుకుంటున్న వీళ్ల ఫొటోలను పోలీస్ స్టేషన్, బస్టాండ్లలో పెట్టాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమం సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసం చేసి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని ఆరోపించారు. ఏడేండ్ల పాలనలో తెలంగాణలోని ఏ వర్గం సంతోషంగా లేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రధాని మోడీ ప్రజల నుంచి రూ.36 లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ ఇద్దరి ఫొటోలను పోలీస్ స్టేషన్లు, బస్స్టాండ్లలో పెట్టాలని రేవంత్ అన్నారు. పెట్రోల్, డీజిల్పై 65 రూపాయలను అదనంగా ప్రజల నుంచి గుంజుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఇంత దోపిడీ ఎక్కడ లేదని, మన దేశంలోనే పెట్రోల్ ధరలపై ఈ స్థాయి దోపిడీ జరుగుతోందని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోల్ కు ఎక్కువ ధర ఉందన్నారు. శత్రుదేశం పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్ రూ.53 ఉందని చెప్పారు. పేదల బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోడీ ఎన్నికల టైంలో చెప్పారని, ఆ హామీ ఏమైందని రేవత్ ప్రశ్నించారు.
ఇద్దరూ జేబు దొంగలే.. వీళ్ల ఫొటోలు పోలీస్స్టేషన్, బస్టాండ్లలో పెట్టాలె
- హైదరాబాద్
- July 16, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- తెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
- కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై RBI ఆంక్షలు
- T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్కు జట్టును ప్రకటించిన పఠాన్
- Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్
- ఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు