- ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపు
- ప్రభుత్వం మెడలు వంచే వరకూ కార్మికులకు అండగా పోరాటం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపు (సోమవారం) ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సర్కార్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు.
ప్రభుత్వం మెడలు వంచి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు. అందులో భాగంగా సోమవారం తలపెట్టిన పెట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.