
సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. TSTS (Telangana State Technology Services Ltd) చైర్మన్ కేటీఆర్ కు దగ్గరి బంధువని రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను TSTS మాత్రమే నిర్వహిస్తోందని తెలిపారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందన్నారు.కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆఫీస్ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇక ఈ పేపర్ లీకేజీ కేసులో చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ రేవంత్కు సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన సిట్ అధికారులు రేవంత్ ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారు. మార్చి 23న ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొన్నారు.