జూన్ 2 (రేపు) హైద‌రాబాద్లో.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

 జూన్ 2 (రేపు) హైద‌రాబాద్లో..  ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మూడు వారాల పాటు  ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్  చేసింది. తొలిరోజు  2023 జూన్ 02న శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం  కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు  విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారిమళ్లించనున్నారు.  అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. 

  • వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు.
  •  ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. 
  • వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.
  • ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. 
  • అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. 
  • అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
  • ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
  • బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
  • బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.
  • మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మూసివేయబడతాయి. వాటిలో కొన్ని ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ మరియు లుంబినీ పార్క్. 21 రోజుల పాటు సాగే ఈ దశాబ్ధ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విభిన్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసింది.