ఉదయం నుంచి సాయత్రం వరకు దుమ్ము, ధూళి మధ్య ఉంటూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే కానిస్టేబుళ్లకు ప్రస్తుతం ఎండ తీవ్రత మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా నిజామాబాద్ జిల్లా పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ బూత్లలో ఫాగింగ్ మిస్ట్ మెషీన్లను ఏర్పాటు చేశారు. వీటికి వాటర్ క్యాన్ను కనెక్ట్ చేసి మోటార్ ఆన్ చేయగానే.. బూత్ మొత్తం నీటి జల్లులు పడుతున్నాయి. దీంతోఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. -
