చందానగర్లో విషాదం..భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

చందానగర్లో విషాదం..భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

హైదరాబాద్:భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ లోని చందానగర్​ లో జరిగింది. ఆదివారం(జూన్29) పాపిరెడ్డికాలనీ ఆరంబ్​ టౌన్​ షిప్​ లో నివాసముంటున్న పాలకొండ కుమారి(33) భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. మృతురాలికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15),రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు.