వర్షాల ఎఫెక్ట్ : హైదరాబాద్లో విద్యుత్ షాక్తో మహిళ మృతి

వర్షాల ఎఫెక్ట్ : హైదరాబాద్లో విద్యుత్ షాక్తో మహిళ మృతి

హైదరాబాద్ : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కురిసిన వర్షానికి ఫిరోజ్ గూడాలోని మాధవి నగర్ లోని ఇండ్లల్లోకి వర్షం నీరు చేరింది. మధ్యాహ్నం తర్వాత వర్షం తగ్గడంతో ఇంట్లో ఉన్న నీటిని నిషాద్ బేగం అనే మహిళ తొలగించింది. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. 

వెంటనే స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే నిషాద్ బేగం మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు.