సైబరాబాద్​లో 14 మంది ఇన్​స్పెక్టర్​ల ట్రాన్స్​ఫర్

సైబరాబాద్​లో 14 మంది ఇన్​స్పెక్టర్​ల ట్రాన్స్​ఫర్

గచ్చిబౌలి/షాద్​నగర్​, వెలుగు: సైబరాబాద్​ పోలీస్​కమిషనరేట్ లిమిట్స్​లో 14 మంది ఇన్​స్పెక్టర్​లు బదిలీ అయ్యారు. వీరిని ట్రాన్స్​ఫర్ చేస్తున్న సైబరాబాద్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేపీహెచ్​బీ డీఐగా ఉన్న వెంకటేశ్​ కేపీహెచ్​బీ ఇన్​స్పెక్టర్​గా, అమన్​గల్ ​సీఐ జె.ఉపేందర్​రావు అల్వాల్​ఇన్​స్పెక్టర్​గా ట్రాన్స్​ఫర్​అయ్యారు. అల్వాల్ ​ఇన్​స్పెక్టర్​గా ఉన్న ఎ.గంగాధర్​కమిషనరేట్​కు అటాచ్ ​అయ్యారు. మేడ్చల్​ జోన్​ ఎస్​ఓటీ ఇన్​స్పెక్టర్ ​బి.జేమ్స్​బాబు గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​గా, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్ ​జి.సురేశ్ ​మేడ్చల్​జోన్​ఎస్​ఓటీ ఇన్​స్పెక్టర్​గా ట్రాన్స్​ఫర్​అయ్యారు. చందానగర్​ డీఐ డి.పాలవెల్లి చందానగర్​ ఇన్​స్పెక్టర్​గా, సైబర్ ​క్రైమ్ ​ఇన్​స్పెక్టర్ ​పి.నరేందర్ ​మాదాపూర్​జోన్​ స్పెషల్ ​బ్రాంచ్ ​ఇన్​స్పెక్టర్​గా బదిలీ అయ్యారు. చందానగర్ ​ఇన్​స్పెక్టర్ ​కె.కాస్ట్రో సైబరాబాద్ కమిషనరేట్​అఫీస్​కు అటాచ్​అయ్యారు.

కొత్తూరు ఇన్​స్పెక్టర్​ జి.బాలరాజు సనత్​నగర్​ఇన్​స్పెక్టర్​గా, అక్కడి ​ఇన్​స్పెక్టర్ ​ముత్తు యాదవ్ ​చేవెళ్ల ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​గా ట్రాన్స్​ఫర్ అయ్యారు. ఆర్సీపురం డీఐ ప్రతాప్ ​లింగం షాద్​నగర్​పట్టణ ఇన్​స్పెక్టర్​గా బదిలీ కాగా, అక్కడ ఇన్​స్పెక్టర్​నవీన్ ​కుమార్ కమిషనరేట్​కు అటాచ్ అయ్యారు. సైబర్ ​క్రైమ్​లో​ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న ఎన్.సురేశ్ ​నందిగామకు బదిలీ కాగా అక్కడి ఇన్​స్పెక్టర్ సీహెచ్.రమేశ్​ను సీపీ ఆఫీస్​కు అటాచ్ చేశారు. బదిలీ అయిన ఇన్​స్పెక్టర్​లు వెంటనే తమకు కేటాయించిన పోలీస్​ స్టేషన్​లో రిపోర్టు చేయాలని సీపీ ఉత్తర్వుల్లో వెల్లడించారు.