గచ్చిబౌలి/షాద్నగర్, వెలుగు: సైబరాబాద్ పోలీస్కమిషనరేట్ లిమిట్స్లో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వీరిని ట్రాన్స్ఫర్ చేస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేపీహెచ్బీ డీఐగా ఉన్న వెంకటేశ్ కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్గా, అమన్గల్ సీఐ జె.ఉపేందర్రావు అల్వాల్ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్అయ్యారు. అల్వాల్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఎ.గంగాధర్కమిషనరేట్కు అటాచ్ అయ్యారు. మేడ్చల్ జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.జేమ్స్బాబు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్గా, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేశ్ మేడ్చల్జోన్ఎస్ఓటీ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్అయ్యారు. చందానగర్ డీఐ డి.పాలవెల్లి చందానగర్ ఇన్స్పెక్టర్గా, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.నరేందర్ మాదాపూర్జోన్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. చందానగర్ ఇన్స్పెక్టర్ కె.కాస్ట్రో సైబరాబాద్ కమిషనరేట్అఫీస్కు అటాచ్అయ్యారు.
కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.బాలరాజు సనత్నగర్ఇన్స్పెక్టర్గా, అక్కడి ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆర్సీపురం డీఐ ప్రతాప్ లింగం షాద్నగర్పట్టణ ఇన్స్పెక్టర్గా బదిలీ కాగా, అక్కడ ఇన్స్పెక్టర్నవీన్ కుమార్ కమిషనరేట్కు అటాచ్ అయ్యారు. సైబర్ క్రైమ్లోఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎన్.సురేశ్ నందిగామకు బదిలీ కాగా అక్కడి ఇన్స్పెక్టర్ సీహెచ్.రమేశ్ను సీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు వెంటనే తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని సీపీ ఉత్తర్వుల్లో వెల్లడించారు.