సైబరాబాద్​లో 18 మంది ఎస్ఐల బదిలీ

సైబరాబాద్​లో 18 మంది ఎస్ఐల బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​లో 18 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం సీపీ అవినాశ్​ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి ఎస్సై అవినాష్​ బాబును శంషాబాద్ సీసీఎస్ కు, మాదాపూర్ ఎస్ఐ నర్సింహారావును మొయినాబాద్ పీఎస్ కు, బాలానగర్ ఎస్ వోటీ ఎస్ఐ సాయినాథ్ ను గచ్చిబౌలి పీఎస్ కు, షాబాద్ ఎస్ఐ బాలరాజ్ ను మాదాపూర్ పీఎస్ కు బదిలీ చేశారు. వీరితో పాటు మరికొంత మంది ఎస్ఐలు బదిలీ అయ్యారు. ట్రాన్స్ ఫర్ అయిన వారు వెంటనే వారికి కేటాయించిన పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.