6 వేల మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ

6 వేల మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
  • నేడు ఎస్ఏ, పీఎస్‌‌‌‌‌‌‌‌హెచ్ఎం,పీడీ వెకెన్సీ లిస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం మల్టీజోన్ 2 పరిధిలో 6,013 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. వారందరికీ కొత్త స్కూళ్లను కేటాయించగా, ఆయా బడుల్లో చేరారు. సంగారెడ్డి జిల్లాలో 834 మంది, జనగామలో 335, యాదాద్రిలో 562, మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో 456, వికారాబాద్‌‌‌‌‌‌‌‌లో 641, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 397, జోగుళాంబ గద్వాలలో 305, వనపర్తిలో 310, నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌లో 451, నల్గొండలో 876, సూర్యాపేటలో 575, నారాయణపేటలో 271 మంది టీచర్ల బదిలీ అయ్యారు. 

కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు ఆగిపోయాయి. హైదరాబాద్ జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బదిలీలు పూర్తికాగా, వారందరినీ ఈ నెల 8న పాత స్కూళ్ల నుంచి రిలీవ్ చేశారు. ప్రస్తుతం మల్టీజోన్ 2లో ఎస్జీటీ, పండిట్, పీఈటీల సీనియార్టీ లిస్టులను జిల్లాల్లో డీఈవోలు ప్రకటించారు. మంగళవారం వారికి స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్‌‌‌‌‌‌‌‌హెచ్ఎం, ఎస్ఏ (లాంగ్వేజెస్), పీడీ పోస్టుల వెకెన్సీ లిస్టులను రిలీజ్ చేసి, వెంటనే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఒకటి రెండ్రోజుల్లో వారికి ప్రమోషన్లతో పాటు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు.