
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ ల బదిలీ చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్ లను బదిలీ చేయగా..తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.
- షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ- ఎం శ్రీధర్
- వైద్యశాఖ జాయింట్ సెక్రటరీ -వినయ్ కృష్ణారెడ్డి
- పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ-అమోయ్ కుమార్
- గనుల శాఖ డైరెక్టర్ - సుశీల్ కుమార్
- రోడ్డు భవనాల శాఖ జాయింట్ సెక్రటరీ - హరీష్
- టీఎస్ ఐఆర్డీ సీఈవోగా -కాత్యాయనిదేవి