సింగరేణిలో ఆఫీసర్ల బదిలీ

సింగరేణిలో ఆఫీసర్ల బదిలీ

కోల్​బెల్ట్, వెలుగు :  సింగరేణి సంస్థలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న పలువురు ఏజీఎం, డీజీఎం, మేనేజర్, డిప్యూటీ, అడిషనల్ మేనేజర్ స్థాయి ఉన్నతాధికారులను మేనేజ్​మెంట్ బదిలీ చేసింది. బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్​ ఏరియా ఎస్ వో టూ జీఎంగా పనిచేస్తున్న ఏజీఎం కె.రఘు కుమార్​ను రామగుండం రీజియన్ ​సేఫ్టీ ఆఫీసర్​గా బదిలీ చేసింది. శ్రీరాంపూర్​ ఏరియా ఎస్ఆర్​పీ ఓపెన్ కాస్ట్ ​ప్రాజెక్ట్​ అధికారి, డీజీఎం వి.పురుషోత్తంరెడ్డిని అదే ఏరియా ఎస్​వోటూ జీఎంగా నియమించింది.

అడ్రియాల ప్రాజెక్టు ఎస్ వోటూ జీఎంగా పనిచేస్తున్న ఏజీఎం డి.బైద్యను రామగుండం-1 ఏరియా సేఫ్టీ అధికారిగా, హైదరాబాద్​ మార్కెట్, మూవ్​మెంట్​లో డీజీఎం టి.శ్రీనివాస్​ను ఎస్​ఆర్​పీ ఓపెన్​ కాస్ట్​ పీవోగా బదిలీ చేసింది. రామగుండం-1 ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ బండి సత్యనారాయణను అడ్రియాల ప్రాజెక్టుకు, రామగుండం-1 క్వాలిటీ మేనేజ్​మెంట్​కు చెందిన ఎన్.శ్రీధర్​ను శ్రీరాంపూర్ ​ఏరియా ఆర్కే-7 గనికి, రామకృష్ణాపూర్ ఓపెన్​ కాస్ట్​ మైన్​ మేనేజర్​గా పనిచేస్తున్న డీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్లును ఇందారం-1ఏ గనికి, ఆర్కే-7 గనికి చెందిన డీజీఎం సాయిప్రసాద్​ను రామగుండం-1 క్వాలిటీ మేనేజ్​మెంట్ ​డిపార్ట్​మెంట్​కు యాజమాన్యం బదిలీ చేసింది.

హైదరాబాద్ ​సీఎండీ ఆఫీస్​లో ఎస్​వోఎం కె.కృష్ణాచారిని ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్​గా, ఇందారం-1ఏ మైన్ మేనేజర్​ బి.బ్రహ్మాజీరావును శ్రీరాంపూర్​ఓసీపీకి, అదే ఓసీపీలో పనిచేస్తున్న సుధీర్​ జయవంతరావును రామకృష్ణాపూర్ ​ఓపెన్​ కాస్ట్​ మైన్​కు, కొత్తగూడెం ఎస్​అండ్​పీ అడిషనల్ ​మేనేజర్​గా పనిచేస్తున్న డి.రమణారెడ్డిని మణుగూరు పీకే ఓసీపీకి, హైదరాబాద్​ మార్కెటింగ్ -మూవ్​మెంట్​కు చెందిన పి.మహేందర్​రెడ్డిని రామగుండం-2 ఏరియా ఓసీపీ-3కి, మణుగూరు ఎంవీటీసీ నుంచి జి.లక్ష్మన్​ను మణుగూరు ఎస్ఎంఎస్​ ప్లాంట్​కు, కొత్తగూడెం ఏరియా వీకే-7 మైన్​ అడిషనల్​మేనేజర్ ​జె.శంకర్​ను కోట్లగూడెం ఏరియా ఎస్​అండ్​పీ విభాగానికి ట్రాన్స్​ఫర్​ చేశారు. మందమర్రి ఏరియా ఆర్కే-1ఏ మైన్ డిప్యూటీ మేనేజర్​బూడిద జయంత్​ కుమార్​ను అడ్రియాల ప్రాజెక్టుకు, కార్పొరేట్​ఎన్విరాన్​మెంట్ ​సెల్​ డిప్యూటీ మేనేజర్​ఎ.సునీల్ కుమార్​ను మణుగూరు పీకే ఓసీపీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.