రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి సీ.ఐ నాగార్జున పై సస్పెన్షన్ బదిలీ వేటుపడింది. సీ.ఐను బదిలీ చేస్తున్నట్టు సీపీ. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మల్టీజోన్ 2కు అటాచ్ చేస్తున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా వివాదాలకు కేరఫ్ అడ్రస్లా పీఎస్ మారింది. పీఎస్ పై ఏసీబీ అధికారులు రైడ్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
చైతన్యపురి సీఎస్ లో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్కానిస్టేబుల్ ప్రసాద్బాబు, కానిస్టేబుల్ బీ. మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్లు ఐదు రోజుల క్రితం లంచం తీసుకొని ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడి నుంచి రూ. 3 లక్షలు తీసుకొని పట్టుబడ్డారు. పీఎస్ లో రైడ్ చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ పై బదిలీ వేటు పడింది. పీ. నాగరాజు గౌడ్ కు ఇన్సెపెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు.