విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు సూసైడ్

విశాఖలో ట్రయాంగిల్  లవ్ స్టోరీ.. ఇద్దరు సూసైడ్

విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో ట్రయాంగిల్  లవ్ స్టోరీలో  విషాదం నెలకొంది.  ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆమె కూడా ఇద్దరితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది.  ఇద్దరితో చనువుగా ఉన్న  ఫొటోలు, వీడియోలు  బయటకు రావడంతో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు.  మరోకరిని పోలీసులు ఆరెస్ట్ చేశారు.  చనిపోయిన యువతి మైనర్ కావడం, సూసైడ్ నోట్ కూడా రాయడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

విశాఖలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల  బాలికకు సాయికుమార్,  సూర్యప్రకాష్ లతో పరిచయం ఏర్పడింది.  ఇద్దరితోనూ బాలిక చనువుగా ఉంది. ఈ క్రమంలో సాయికుమార్  బాలికకు రహస్యంగా తాళి కట్టాడు. దీనికి సంబంధించిన వీడియో  ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.  దీంతో  ప్రేమ విషయంలో అటో ఇటో తేల్చుకోవాలని సూర్యప్రకాష్, సాయికుమార్ ఆ బాలికపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ వేధింపులు తట్టుకోలేక  ఆ బాలిక 2023 ఆగస్టు 10న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  దీంతో వీరిద్దరిపై  బాలిక  తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

బాలిక సూసైడ్ చేసుకున్న రోజే సూర్యప్రకాష్ కూడా రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.  పట్టాలపై అతని శవాన్ని పోలీసులు గుర్తి్ంచారు.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాయికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.  మైనర్ ను ప్రేమించాలని ప్రేరేపించినందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.