బీఆర్ఎస్​ లీడర్ల ఎదుట గిరిజనుల జై కాంగ్రెస్ నినాదాలు

బీఆర్ఎస్​ లీడర్ల ఎదుట గిరిజనుల జై కాంగ్రెస్ నినాదాలు
  • మా తండాకు ఎమ్మెల్యే పద్మ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్​
  • మెదక్​ జిల్లా జెడ్​చెర్వులో ఘటన

నిజాంపేట, వెలుగు : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మద్దతుగా మంగళవారం మండల పరిధిలోని జెడ్ చెర్వు గ్రామంలో ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్​లీడర్ల ఎదుట గిరిజనులు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. దీంతో లీడర్లు వారిని ఆపేందుకు వెళ్లగా తమ తండాకు ఎమ్మెల్యే ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

‘ఎలక్షన్లు వచ్చినయని ఈ రోజు ఎమ్మెల్యే మా తండాకు వస్తున్నరు. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలే. మేము ఏం అంటలేమనా? తండాలో డబుల్ బెడ్ రూమ్ లు ఎవలకిచ్చిన్రు. మూడెకరాల భూమి ఎవరికిచ్చిన్రు?’ అని నిలదీశారు. తండాను ఏం డెవలప్ మెంట్​ చేసిన్రో చెప్తే మేమే ఎమ్మెల్యేను ప్రచారానికి తీసుకుపోతం’ అని అన్నారు. దీంతో వారికి నచ్చజెప్పి పంపించారు.