శంషాబాద్/వికారాబాద్ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని సోమవారం శంషాబాద్ మండలం పాలమాకులలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి ఫొటోకు పాలమాకుల సర్పంచ్ సుష్మ పూలమాల వేసి నివాళులర్పించారు. కాటేదాన్లోని బీజేపీ ఆఫీసులో మైలార్దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షుడు అడిగె జనార్దన్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతిని నిర్వహించారు.
కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని వాజ్పేయి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 24వ వార్డులో వాజ్ పేయి జయంతిని నిర్వహించారు.