ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది.ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించే ముందు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సంప్రదించలేదని పేర్కొంది. టీఎంసీ ఎంపీలతో సమావేశమైన తర్వాత దీదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీని సంప్రదించకుండా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వాను బరిలోకి దింపాయి. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ను ఎన్డీఏ రంగంలోకి దించింది. ఆగస్టు 6న ఉపపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే నెల 10న వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది.