పెద్దపల్లి, వెలుగు: పదోతరగతి ఫలితాల్లో పెద్దపల్లిలోని ట్రినిటి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు గాను పి. జ్యోతిర్మయి 588 మార్కులు సాధించింది.
ఆరాధ్య 586, ఎం శ్రీచైత్ర 584, కె హరిణి 582, జి నిరీక్ష 582, బి నవ్యశ్రీ 581, వై విశ్వంత్ రుషి 581, శ్రీహర్షవర్థన్ 580, డి శ్రీకర్ 580 మార్కులు సాధించారు. 10 మంది 580 పైగా, 259 మంది 500 పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. విద్యార్థులను పాఠశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్రెడ్డి, కరస్పాండెంట్ దాసరి ప్రశాంత్రెడ్డి, దాసరి మమతారెడ్డి అభినందించారు.
