
‘యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్గా మారిన త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ సినిమా తర్వాత యూత్తో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటివరకూ ఆమె సినిమాలను పట్టించుకోని ప్రేక్షకులు.. ఇప్పుడు ఆమె నుంచి ఏ సినిమా వస్తుందా అని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో విక్కీ కౌశల్కు జంటగా నటించిన రీసెంట్ మూవీ బ్యాడ్న్యూస్ (Bad Newz).ఈ బోల్డ్ రొమాంటిక్ మూవీలో విక్కీ కౌషల్, అమీ విర్క్ హీరోలుగా నటించారు. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేశాడు.
గత నెలలో (జులై 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ను వీపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్కు వచ్చిన ప్రేక్షకులకు నవ్వులు పంచింది.తాజాగా ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) బ్యాడ్న్యూస్ అందుబాటులోకి వచ్చింది. తొలుత రెంటల్ విధానంలో ఈ బాలీవుడ్ మూవీని రిలీజ్ చేసి..ఆ తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్లాన్ చేసినట్లు తెలిసింది.
Also Read:-కడుపుబ్బా నవ్వించేలా..శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్
ఇద్దరు హీరోలతోనూ ఫిజికల్ రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని పెటర్నిటీ పరీక్షలు చేయిస్తే.. ఆ ఇద్దరూ అని తేలుతుంది. ఆ తర్వాత ఆమె ఎవరితో రిలేషన్లో ఉంది.. వారసుడి విషయంలో ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటి అనేది అసలు కథ. పుట్టబోయే బిడ్డ విషయంలో ఇద్దరు తండ్రులు పోటీపడటం హిలేరియస్గా ఉంది. ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ దర్శకుడు ఆనంద్ తివారీ పూర్తిస్థాయి ఎంటర్టైనర్లా తెరకెక్కించారు.దాదాపు తొంభై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీకి రూ.100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి.
బ్యాడ్న్యూస్ కథ:
బోల్డ్ కాన్సెప్ట్తో డైరెక్టర్ ఆనంద్ తివారీ బ్యాడ్ న్యూస్ మూవీని తెరకెక్కించాడు. వంటల పోటీల్లో ఆస్కార్లా భావించే మెరాకీ స్టార్ పురస్కారాన్ని సాధించడమే సలోనీ బగ్గా (త్రిప్తి డిమ్రి) కల. కానీ, ఆమెను ఇంట్లో పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి విషయంలోనూ ఎన్నో కలలున్నా..చివరికి దిల్లీ కరోల్బాగ్కు చెందిన ఓ షాప్ నిర్వాహకుడైన అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని ఇష్టపడి పెళ్లి పీటలెక్కుతుంది. కానీ మనస్పర్థల కారణంగా కొద్ది రోజుల్లోనే అఖిల్ నుంచి సలోనీ విడాకులు తీసుకుంటుంది.ఆ తర్వాత అనుకోకుండా గుర్బీర్ సింగ్ తో (అమీ విర్క్) సలోనీ రిలేషన్ కొనసాగిస్తుంది. అఖిల్, గుర్బీర్ ఇద్దరి కారణంగా సలోనీ తల్లికాబోతున్నట్లు, ఆమెకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు డాక్టర్స్ ప్రకటిస్తారు.
ఈ కవల పిల్లల్లో ఒకరు అఖిల్ సంతానమని, మరొకరు గుర్బీర్కు జన్మించనున్నట్లు డాక్టర్లు వెల్లడిస్తారు. హెటేరో పాటర్నల్ సూపర్ ఫెకండేషన్ కారణంగా ఇలా జరిగిందని డాక్టర్లు చెబుతారు. అఖిల్, గుర్బీర్ సింగ్లలో సలోనీ ఎవరిని నిజంగా ప్రేమించింది. తమ పిల్లల కోసం అఖిల్, గుర్బీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నదే ఈ మూవీ కథ. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా 2019లో రిలీజైన గుడ్ న్యూస్ మూవీకి సీక్వెల్గా బ్యాడ్ న్యూస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.