పంజాగుట్ట, వెలుగు: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప గవర్నర్ను కలిసి హాస్పిటల్లో అందుతున్న వైద్యసేవలను వివరించారు. కార్డియాలజీ హెచ్వోడీ ప్రొఫెసర్ శ్రీనివాస్, డాక్టర్సతీష్రావు గవర్న ర్కు టెస్టులు చేశారు.
గవర్నర్కు వైద్యపరీక్షలపై బీరప్ప మాట్లాడుతూ.. ఇది సాధారణ టెస్టుల్లో భాగంగానే ఆయనకు పరీక్షలు చేశామని, గతంలోనూ వైద్యపరీక్షలు నిర్వహించామనిని చెప్పారు. త్రిపుర వెళ్లేముందు మరోసారి ఆస్పత్రికి వచ్చారని తెలిపారు.