త్రిపుర గవర్నర్​కు నిమ్స్​లో టెస్టులు

త్రిపుర గవర్నర్​కు నిమ్స్​లో టెస్టులు

పంజాగుట్ట, వెలుగు: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ డైరెక్టర్  బీరప్ప గవర్నర్​ను కలిసి హాస్పిటల్​లో అందుతున్న వైద్యసేవలను వివరించారు. కార్డియాలజీ  హెచ్​వోడీ ప్రొఫెసర్​ శ్రీనివాస్, డాక్టర్​సతీష్​రావు గవర్న ర్​కు టెస్టులు చేశారు. 

గవర్నర్​కు వైద్యపరీక్షలపై బీరప్ప మాట్లాడుతూ.. ఇది సాధారణ టెస్టుల్లో భాగంగానే ఆయనకు పరీక్షలు చేశామని, గతంలోనూ వైద్యపరీక్షలు నిర్వహించామనిని చెప్పారు. త్రిపుర వెళ్లేముందు మరోసారి ఆస్పత్రికి వచ్చారని తెలిపారు.