
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. కుమారుడి డిగ్రీ పట్టా ప్రెజెంటేషన్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తన కుమారుడు సాధించిన విజయాన్ని చూసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మంత్రి తనయుడు అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డను కూడా అందుకున్నాడు.
డియర్ అచ్చూ..
"మా అబ్బాయి అర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను?.. ఇది అతని పట్టుదలకు, ఆకాంక్షకు నిదర్శనం. తన నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు.. అచ్చూ.. ఈ అద్భుతమైన మైలురాయిని అధిగమించిన సందర్భంగా నీకు ప్రత్యేక అభినందనలు" అంటూ మంత్రి ట్వీట్ చేశారు.