నామినేషన్లు వేసిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు

నామినేషన్లు వేసిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్  కు ముందు నిడమనూరు మండలం తుమ్మడ శివాలయంలో పూజలు చేశారు భగత్. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కూడా నామినేషన్ వేశారు. సెంటిమెంట్ ప్రకారం ముందుగా నాగార్జున సాగర్ లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఆ తర్వాత నిడమనూరులో నామినేషన్ వేశారు జానారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.  బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో MLA రాజా సింగ్ హాజరయ్యారు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు.