హైదరాబాద్‌లోనూ టీఆర్ఎస్ ముందంజ

హైదరాబాద్‌లోనూ టీఆర్ఎస్ ముందంజ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. తొలి రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఆధిక్యం లభించింది. తొలి రౌండ్‌లో వాణిదేవికి 17,439 ఓట్లు నమోదయ్యాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి  1054 ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 16,385 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్  8,357 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 5,082 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ సెగ్మెంట్‌లో తొలి రౌండులో 3,374 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి.