సాగర్ కు జానా ఏమీ చేయలే.. గెలిచేది మేమే

సాగర్ కు జానా ఏమీ చేయలే.. గెలిచేది మేమే

నల్లగొండ: నాగార్జున సాగర్ లో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ కూడా క్యాంపెయినింగ్ లో దూసుకుపోతోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. సోమవారం అనుమలర్ మండలం పాలెం, చింతగూడెం, రామడుగులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. ఆయన పాలనలో గ్రామాలు డెవలప్ అయ్యాయని, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపిస్తే సాగర్ మరింతగా అభివద్ధి అవుతుందన్నారు. చాలా కాలం పాటు మంత్రిగా పని చేశానని చెప్పుకోవడం తప్పితే ఈ నియోజకవర్గానికి జానారెడ్డి చేసిందేమీ లేదని మంత్రి శ్రీనివాస్ విమర్శించారు.