పెన్షన్ అడిగితే వికలాంగుడి గల్లా పట్టిన టీఆర్ఎస్ లీడర్

పెన్షన్ అడిగితే వికలాంగుడి గల్లా పట్టిన టీఆర్ఎస్ లీడర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో జరిగిన టీఆర్ఎస్ ధూంధాం వేదికపై ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఫించన్ రావడం లేదంటూ రాజేష్ అనే వికలాంగుడు ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. స్టేజీపైకి వచ్చిన దివ్యాంగుడైన యువకుడిని... టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి గల్లా పట్టి లాగాడు. దీంతో యువకుడు స్టేజ్ పై పడిపోయాడు. తాను ఎవరికీ భయపడనని.. తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదనగా చెప్పాడు దివ్యాంగ బాధితుడు.