ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులతో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి సభ్యులుగా పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి   మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు, అందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ. .ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు.

మరో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.

నల్గొండ జిల్లాలో అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలని తెర చిన్నపరెడ్డి  అన్నారు. ప్రతి ఓటరుకు రుణపడి ఉంటానని అన్నారు.