బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య స్టెప్పులు

బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య స్టెప్పులు

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా  డుగు డుగు డుగు డుగని‘. ఈ పాట ఎంత  పాపాలర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరోజులోనే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది . అప్పటి నుంచి  ఏ ఫంక్షన్స్ ,వేదికల్లో అయినా ఇదే పాట వినిపిస్తోంది. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, సామాన్యులు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇపుడు ఇదే పాట మీద స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టెప్పులేశారు. జనగామ జిల్లా పల్లగుట్టలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తర్వాత స్టేజ్ పై చిన్నారులు బుల్లెట్ పాటకు స్టెప్పులేస్తున్నారు. స్టేజ్ పైకి ఎక్కిన రాజయ్య పిల్లలతో కలిసి కాసేపు సరదాగా డ్యాన్సు చేశారు.