
న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్షాతో భేటీ అయ్యారు. చాలా కాలంగా బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్, అరుణ్జైట్లీతో పాటు అమిత్ షాతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. తన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్కు అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నందుకు అమిత్ షాకు డీఎస్ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ తో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశాలు లేవని సమాచారం. డీఎస్ రాజ్యసభ పదవీ కాలం 2022 మార్చి వరకు ఉంది.